YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం

ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం

ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం
    ప్రధానిమోదీ,గుజరాత్ సిఎం విజయ్ రూపానీతో పాటు 
            త్రివిధ దళాల అధిపతుల స్వాగతం
అహ్మదాబాధ్ ఫిబ్రవరి 24 
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి గుజరాత్ లోని అహ్మదాబా ధ్ చేరుకున్నారు. ట్రంప్ దంపతులకు రెడ్ కార్పేట్ స్వాగతం లభించింది.విమానం దిగగానే అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు త్రివిధ దళాల అధిపతులు విశేష స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి సబర్మతీ ఆశ్రమానికి భారీ కాన్వాయితో ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ట్రంప్ కు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని  ప్రజలు ఘన స్వాగతం పలికారు. అయితే ఈ పర్యటనలో భారత జెండాలు త్రివర్ణ పతాకం కాకుండా అమెరికా జెండాలు కనిపించాయి. ఈ సందర్భంగా గుజరాత్ సంప్రదాయ కళలతో ట్రంప్ దంపతులను ఆహ్వానించారు. కళాకారులు సంప్రదాయ వాయిద్యాలు వస్త్రధారణతో ట్రంప్కు స్వాగతం పలికారు.అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి ట్రంప్ దంపతులు ర్యాలీగా అహ్మదాబాద్ నుంచి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి బయల్దేరారు. దారి వెంట వేలాదిగా నిలిచిన భక్తులు స్వాగతం పలికారు. 

Related Posts