YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తెలుగు భాష, సంస్కృతిని నాశనం చేస్తున్నసీఎం జగన్‌: గోరంట్ల

తెలుగు భాష, సంస్కృతిని నాశనం చేస్తున్నసీఎం జగన్‌: గోరంట్ల

తెలుగు భాష, సంస్కృతిని నాశనం చేస్తున్నసీఎం జగన్‌: గోరంట్ల
రాజమండ్రి ఫిబ్రవరి 24
తెలుగు భాషను, సంస్కృతిని సీఎం జగన్‌ నాశనం చేస్తున్నారని  టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెలుగు వర్సిటీ భూములను ఇళ్ల స్థలాల కోసం లాక్కుంటున్నారని మండిపడ్డారు. గతంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న పాలసీలపై సిట్‌ వేస్తారా అని గోరంట్ల ప్రశ్నించారు. రాజమండ్రలో నిర్మాణం పూర్తయిన 4,200 ఇళ్లను పేదలకు పంపిణీ చేయడం లేదని విమర్వించారు.  రాజమండ్రిలో వైసీపీ నేతలు ఇసుకను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 9 నెలల్లో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంత్రి బుగ్గన మైనింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గోరంట్ల ప్రశ్నించారు. కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్ బంగ్లాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో పేదలకు ఇళ్లు కడతారా అని నిలదీశారు. వైసీపీ నేతలు భూములు కబ్జా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. రూ.43వేల కోట్లు దోచిన జగన్‌.. అవినీతి రహిత పాలన అందిస్తారా అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు. 

Related Posts