రైతులు, మహిళల మానవహారం
అమరావతి ఫిబ్రవరి 24
సీడ్ యాక్సెస్ రోడ్డుపై రాజధాని రైతులు మానవహారం నిర్వహించారు. మందడం సెంటర్ నుంచి రాయపూడి సెంటర్ వరకు రోడ్డుకు రైతులు, మహిళలు ఒకవైపు నిలబడ్డారు. ఇదే మార్గంలో హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి వెళుతున్నారు. ఆయనకు శాంతియుతంగా నమస్కరిస్తూ.. తమ మొర ఆలకించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మా జీవితాలను ప్రభుత్వం వీధులపాలు చేసిందన్నారు. న్యాయవ్యవస్థ ద్వారా మాత్రమే తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో న్యాయమూర్తులను వేడుకుంటున్నామని వారన్నారు. పెనుమాక,ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూ డి,వెలగపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు, మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది. అలాగే మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.