టీడీపీకి మతి భ్రమించి దాడులు చేస్తోంది
ఆదిమూలపు సురేష్
అమరావతి ఫిబ్రవరి 24
ఎంపీ నందిగం సురేష్ పై దాడిని ఖండిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలు కొట్టిన దెబ్బకు టీడీపీకి మతి భ్రమించి దిక్కుతోచక ఇలాంటి దాడులు చేస్తోందన్నారు. రాజధాని అంశాన్ని అడ్డుపెట్టుకొని రైతుల ముసుగులో.. టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారన్నారు. దాడులతో బెదిరించాలని చూస్తే భయపడేది లేదన్నారు. ప్రజలే టీడీపీకి బుద్ధి చెబుతారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు