YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

 ట్రంప్ కు కేసీఆర్ గిఫ్ట్

 ట్రంప్ కు కేసీఆర్ గిఫ్ట్

 ట్రంప్ కు కేసీఆర్ గిఫ్ట్
హైద్రాబాద్,ఫిబ్రవరి 24
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ భారత గడ్డపై అడుగు పెట్టారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కుటుంబంతో సహా అడుగు పెట్టారు. ఇక ఈ నెల 25న రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఉన్నారు. ఈ నెల 25న జరిగే విందులో కేసీఆర్ పాల్గొనున్నారు.విందు సందర్భంగా ట్రంప్‌ను కలవనున్న కేసీఆర్.. తెలంగాణ తరపున ప్రత్యేకంగా కొన్ని కానుకలు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాముఖ్యతను చాటేలా ఈ స్పెషల్ గిఫ్ట్స్‌ తీసుకెతున్నారట. ఫిలిగ్రి ఛార్మినార్ ప్రతిమతో కూడిన జ్ఞాపిక, పోంచపల్లి శాలువాను అందజేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ట్రంప్ సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకా కోసం పోచంపల్లి, గద్వాల పట్టు చీరల్ని బహూకరించనున్నట్లు సమాచారం. ఈ నెల 25న కేసీఆర్ ఢిల్లీకి వెళుతున్నారు.. విందులో పాల్గొని ఈ నెల 26న తిరిగి హైదరాబాద్‌రానున్నారు. అంతేకాదు ట్రంప్‌కు ఇచ్చే విందులో తెలంగాణ వంటకాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాటుకోడి పకోడిని స్పెషల్‌గా తయారు చేయిస్తున్నారట.

Related Posts