YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చదువుల విప్లవం ప్రారంభమైంది : జగన్

చదువుల విప్లవం ప్రారంభమైంది : జగన్

చదువుల విప్లవం ప్రారంభమైంది : జగన్
విజయనగరం, ఫిబ్రవరి 24
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోన్‌‌రెడ్డి పేద విద్యార్థుల కోసం మరో పథకాన్ని ప్రారంభించారు. ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని సోమవారం ఆయన విజయనగరం జిల్లాలో ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్న సీఎం జగన్‌కు మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చేరుకున్న సీఎం జగన్‌ విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించించారు. అనంతరం వేదికపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించి.. ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా పేదల బతుకు మారలేదని చెప్పారు. ఇకనైనా నిరుపేదల జీవితాల్లో మార్పులు రావాలని ఆకాక్షించారు. పేదల బతుకులు మారాలంటే వారి కుటుంబాలలో ఎవరో ఒకరు ఇంజినీర్, డాక్టర్, ఐఏఎస్ అవ్వాల్సి ఉందన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యనభ్యసించే వారి సంఖ్య రష్యాలో 81 శాతం, బ్రెజిల్, చైన్ దేశాల్లో దాదాపు 50 శాతం ఉండగా ఇండియాలో కేవలం 23 శాతం మాత్రమే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే కుటుంబాలు పేదరికం నుంచి ఎలా బయటపడతాయని సీఎం అన్నారు. పేద విద్యార్థులకు ప్రతి ఏటా వసతి దీవెన ద్వారా రూ.20 వేలు అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. డిగ్రీ, పీజీ చిదివే విద్యార్థులకు రెండు విడతలుగా రూ. 20 వేలు ఇస్తామన్నారు. వసతి, భోజనం ఖర్చుల కోసం విద్యార్థుల తల్లుల అకౌంట్లలోనే నేరుగా డబ్బు జమచేస్తమాని వెల్లడించారు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి వసతి దీవెన ఇస్తామని సీఎం ప్రకటించారు.1.87 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని సీఎం జగన్ వెల్లడించారు. వసతి దీవెన కింద రూ. 2,300 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పేదల జీవితాలలో మార్పు తీసుకురావడానికే వసతి దీవెన పథకం తీసుకొచ్చినట్లు చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విద్యా దీవెన పథకం కింద ఏడాదికి రూ. 3,700 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ రెండు పథకాలతోనే రూ. 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఇప్పటికే రూ. 6,400 కోట్లు ఖర్చు చేశామన్నారు.ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. మన బడి- నాడు నేడు ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల రూపురేఖలు మారతాయన్నారు. మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువే అని సీఎం తెలిపారు. తెలుగును తప్పనిసరి చేస్తూనే ఈ ఏడాది జూన్ నుంచి ప్రతి పాఠశాలలో ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా ఉండాలన్నారు. పేద, మధ్య తరగతి పిల్లల కోసం ఆలోచించే ప్రభుత్వం మనదని చెప్పారు. దశల వారీగా మద్యపాన నిషేధం ద్వారా జీవితాలలో మంచి మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.పేదల సంక్షేమం‌ కోసం శ్రమిస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు నిత్యం విమర్శలు చేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 లక్షల‌ మంది‌ నిరుపేదలకు రికార్డు స్థాయిలో ఈ ఉగాదికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుంటే కొన్ని పత్రికలు, మీడియా చానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును ప్రజలు మరిచిపోతారనే భయంతోనే ఆ పత్రికలు, చానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఏ తప్పు చేయకపోయినా రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. ఇందుకు దేవుడి దయ, ప్రజల దీవెనలు కావాలి. రాష్ట్రంలో ఉంది.. ప్రతిపక్షం కాదని, రాక్షసులన్నారు. రాష్ట్రంలో ఉన్మాదులు, రాక్షసులతో తాను పోరాటం చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు.విజయనగరంలోని పోలీస్‌ బేరక్స్‌లో నిర్మించిన దిశ పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆయన దిశానిర్దేశం చేశారు. మహిళల నిరంతరం భదత్ర కల్పించాలని, బాధితులకు సత్వర న్యాయం జరగాలని ఆదేశించారు.

Related Posts