YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ట్రంప్ నోట సచిన్,కోహ్లీ మాట

ట్రంప్ నోట సచిన్,కోహ్లీ మాట

ట్రంప్ నోట సచిన్,కోహ్లీ మాట
గాంధీనగర్, ఫిబ్రవరి 24 
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమ‌వారం నుంచి భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గుజ‌రాత్ అహ్మ‌దాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ఏర్పాటు చేసిన న‌మ‌స్తే ట్రంప్ కార్య‌క్ర‌మానికి అమెరికా అధ్య‌క్షుడు త‌న ప‌రివారంతో హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ట్రంప్ వివిధ అంశాల‌పై మాట్లాడారు. బాలీవుడ్‌, క్రికెట్ అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ట్రంప్ సతీమ‌ణి మెలినియా, కూతురు ఇవాంక త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ట్రంప్ మాట్లాడుతూ.. బాలీవుడ్ చిత్రాల‌ను చూసేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లంద‌రూ ఆసక్తికనబరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా క్లాసిక్ చిత్రాలైన దిల్‌వాలే దుల్హ‌నియా లే జాయింగే (డీడీఎల్‌జే), షోలేల‌ను జ్ఞ‌ప్తికి తెచ్చుకున్నారు. అలాగే గొప్ప క్రికెట‌ర్లైన స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లీ ఆట‌ను అంద‌రూ ఆస్వాదిస్తార‌ని పేర్కొన్నారు. అలాగే సాంస్కృతిక నృత్య రీతి భాంగ్రా గురించి కూడా మాట్లాడారు.ఇక తాజా ప‌ర్య‌ట‌న‌లో ట్రంప్.. భార‌త్‌లో నిర్మిత‌మైన అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరా స్టేడియాన్ని సోమ‌వారం ప్రారంభించారు. ఈ స్టేడియం సామ‌ర్థ్యం ల‌క్షా ప‌దివేల మంది కావ‌డం విశేషం. మ‌రోవైపు న‌మ‌స్తే ట్రంప్ కార్య‌క్ర‌మానికి జ‌నం పోటెత్తారు. సుమారు ల‌క్షా 25వేల‌మందికిపైగా ఈ స‌భ‌కు హ‌జర‌య్యార‌ని తెలుస్తోంది. భార‌త్‌లో ట్రంప్ రెండురోజుల‌పాటు ప‌ర్య‌టన జ‌ర‌పుతారు.

Related Posts