YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 మృతదేహాన్ని చూసి షాక్

 మృతదేహాన్ని చూసి షాక్

 మృతదేహాన్ని చూసి షాక్
భోపాల్, ఫిబ్రవరి 24
యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. అతని మృతదేహాన్ని చూసి పోస్టుమార్టం చేయాల్సిన డాక్టర్లు, పోలీసులే షాక్‌కు గురయ్యారు. అత్యంత దారుణంగా చంపేసి.. ఆ తరువాత ఫ్యాన్‌కి ఉరేసి ఆత్మహత్యగా చిత్రకరించే ప్రయత్నం చూసి కంగుతిన్నారు. అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉందన్న దిశగా విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు వెల్లడైనట్టు తెలుస్తోంది.యువకుడి గొంతుకోసి అత్యంత దారుణంగా చంపేసి.. కళ్లు పీకేసిన ఘోరమైన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. మాన్పూర్‌ సమీప గ్రామానికి చెందిన ట్రక్ డ్రైవర్ రవి(27) మాన్పూర్ పట్టణానికి వలసవచ్చాడు. భార్య కవిత ఇద్దరు పిల్లలతో కలసి నివాసం ఉంటున్నాడు. ఎవరూ లేని సమయంలో ఆగంతకులు ఇంట్లో చొరబడి రవిని దారుణంగా హత్య చేశారు.రవి పీకకోసి చంపేసిన దుండగులు.. అతని కనుగ్రుడ్లు పీకేసి అత్యంత అమానుషంగా వ్యవహరించారు. అనంతరం అతని శవాన్ని సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేశారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రవి భార్య కవిత ఇంట్లో లేదు. సమీప బంధువును పలకరించేందుకు ఆమె ఇంటికి వెళ్లింది కవిత. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు.గొంతుకోసం చంపేయడంతో పాటు కళ్లు పీకేయడంతో రవి మృతదేహం భయంకరంగా ఉంది. మృతదేహాన్ని చూసి పోస్టుమార్టం చేయాల్సిన డాక్టర్లు సైతం షాక్‌ అయ్యారు. అంత దారుణంగా ఎందుకు చంపేశారన్న దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. హతుడి భార్య కవిత అక్రమ సంబంధమే హత్యకు దారితీసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వేరొకరితో రాసలీలలు సాగిస్తోందని.. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Posts