తెరాస ప్రజా ప్రతినిధుల విరాళం 500 కోట్లు
హైదరాబాద్ మార్చ్ 26
టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తమ సంపూర్ణ మద్దతు పలికారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహాయంగా ఒక నెల వేతనం, ఒక ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు మొత్తం కలిసి దాదాపు 500 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించడానికి ముందుకు వచ్చారు.