YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ న్యూఢిల్లీ మే 23

సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ న్యూఢిల్లీ మే 23

సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ మే 23
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  జి కిషన్ రెడ్డి, శనివారం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు.  కోవిడ్ 19 వల్ల  సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సినిమా రంగ ప్రముఖులతో ఈ సందర్భంగా చర్చించారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ తేజ , జెమిని కిరణ్ , త్రిపురనేని వరప్రసాద్, దాము కానూరి, వివేక్ కూచిభొట్ల ,అనిల్ శుక్ల, అభిషేక్ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి పలువురు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సినిమా ప్రముఖులు మంత్రి దృష్టికి షూటింగులకు అనుమతి, థియేటర్ల ఓపెనింగ్, క్యాప్టివ్ పవర్, పైరసీ, ఓటిటి లో సినిమా రిలీజ్, రీజనల్ జిఎస్టి, టి డి ఎస్, సినిమా కార్మికుల ప్రత్యేక ప్యాకేజీ పలు అంశాలు తెచ్చారు. వీటిపై స్పందించిన మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ షూటింగ్లకు త్వరలోనే అనుమతి లభిస్తుందని దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు ఓపెనింగ్ చేయడానికి  నిర్ణయం తీసుకుంటామని అలానే అంతర్జాతీయ సినిమా పైరసీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాంతీయ భాషా సినిమాలు పెంపొందేలా నిర్మాణం జరిగేలా రీజినల్ జీఎస్టీ మీద కూడా ఆలోచన చేస్తామని, సినిమా పరిశ్రమ వరకు క్యాప్టివ్ పవర్ కోసం పవర్ మినిస్టర్ తో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. జమ్ము కాశ్మీర్ సహా దేశంలో ఎక్కడైనా సినిమా షూటింగ్ లు , స్టూడియోల నిర్మాణం కోసం తాను ఆయా సీఎం లతో మాట్లాడి  సహాయం చేస్తానని కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులు వస్తే ప్రత్యేక మీటింగ్ పెట్టి సినిమా సమస్యలపై చర్చిద్దామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే వలస కార్మికుల కోసం భారీగా నిధులు విడుదల చేసామని, మధ్య, చిన్న పరిశ్రమల పటిష్టతకు కేంద్ర ప్రభుత్వం, తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రజలందరూ ఈ కష్టకాలంలో రాజకీయ మత ప్రాంత భాషాభేదాలకు అతీతంగా ఉండాలని  కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు అత్యధిక కోవిడ్ కేసులు నమోదయ్యాయని , ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 80 శాతం కేసులు, మహారాష్ట్ర  గుజరాత్, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ లో వస్తే, 90 శాతం కేసులు పది రాష్ట్రాల్లో ఉన్నాయని మంత్రి అన్నారు. వీటిల్లో 60 శాతం కేసులు 5 నగరాల్లో, 70 శాతం కేసులు పది నగరాల్లో కేంద్రీకృతమయ్యాయి అని తెలిపారు. ఈ సమయంలో మాస్కులు ధరించి, స్వీయ రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు  వలస కార్మికులకు 2000 రైళ్లు నడిపామని, మరికొన్ని రైళ్లు నడపటానికి సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి తెలిపారు. విద్యుత్తు ఉత్పత్తి- పంపిణీ లో ఉన్న అంతరాలను తొలగించేందుకు విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నామని దీనివల్ల వన్ నేషన్..వన్ గ్రిడ్  ఎంతో మేలు చేకూరుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.  కరోనా నుంచి బయటపడితే దేశం మరలా పురోగతి సాధిస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి సినిమా పరిశ్రమ ప్రముఖులను పేరుపేరునా మంత్రి యోగక్షేమాలు  అడిగారు. దీనిపై సినిమా ప్రముఖులు కూడా కిషన్ రెడ్డిని అభినందిస్తూ, ప్రభుత్వం బాగా పని చేస్తుంది అంటూ కితాబు ఇచ్చారు.

Related Posts