YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహిళా ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ అడ్మిన్ మేనేజర్  సస్పెండ్ 

మహిళా ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ అడ్మిన్ మేనేజర్  సస్పెండ్ 

మహిళా ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ అడ్మిన్ మేనేజర్  సస్పెండ్ 
నెల్లూరు జూన్ 30  
నెల్లూరు జిల్లా టూరిజం హోటల్ లో కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని ఉషారాణి పై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన అడ్మిన్ మేనేజర్ భాస్కర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు టూరిజం శాఖ మాత్యులు అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో మూతికి మాస్కు పెట్టుకోవాలని కోరి నందుకే, తనపై అత్యంత దారుణంగా ఇనుప రాడ్తో దాడి చేసినట్లు కథనాలకు స్పందించిన మంత్రి శ్రీనివాస్ తక్షణ నిర్ణయం తీసుకొని మేనేజర్ భాస్కర్ ను సస్పెండ్ చేయడం అభినందనీయమని మంత్రి సేవలను సింహపురి ప్రజలు కొనియాడుతున్నారు. ఈ మేరకు నాల్గో నగర పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఉషారాణి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల మేరకు ఈ నెల 27వ తేదీ శనివారం కార్యాలయంలో విధినిర్వహణలో ఉన్న ఆమె, అడ్మిన్ మేనేజర్ భాస్కర్ తో మాట్లాడుతూ, మాస్కు పెట్టుకోవాలని కోరిన అందుకే, మేనేజర్ భాస్కర్ అత్యంత దారుణంగా, ఇనుప రాడ్తో కార్యాలయంలో దాడి చేయడం జరిగిందని తెలిపారు. మేనేజర్ భాస్కర్ కు తగిన శాస్తి చేయాలనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పరిశీలనలో సీసీ పుటేజ్ లలో విషయం బహిర్గతం అయ్యిందని తన ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా నాల్గో నగర పోలీస్ స్టేషన్ సీఐ నాగేశ్వరమ్మ విలేకరులతో మాట్లాడుతూ బాధితురాలు ఉషారాణి ఫిర్యాదు మేరకు, సీసీ ఫుటేజీ ఆధారంతో మేనేజర్ భాస్కర్ పై కేసు నమోదు చేసి, విచారణ జరిపించి , తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Related Posts