YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరు జిల్లాలో దారుణం బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం

చిత్తూరు జిల్లాలో దారుణం బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం

పుంగనూరు జూలై 3  చిత్తూరు జిల్లా  పుంగనూరు మండలం గూడూరుపల్లెలో దారుణం జరిగింది. బాలికపై గ్రామ వాలంటీర్ నరేష్ అత్యాచారానికి తెగబడ్డాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్నానం చేసి ఇంటిలోకి వెళ్తుండగా అటకాయించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సంఘటన జరిగిన రెండు రోజులు తర్వాత బాధిత తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు లేకుండా చూసేందుకు స్థానిక వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. పంచాయితీ విఫలం కావడంతో బాలిక తల్లిదండ్రులు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Related Posts