అమరావతి జూలై 04
మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. కృష్ణాజిల్లా గూడూరు పోలీసు స్టేషన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవీంద్రను రెండో అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో కొల్లు రవీంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్, వైసీపీ నేత మోకా హత్య ప్లానింగ్ లో కొల్లు రవీంద్ర భాగస్వామేనని తెలిపారు. ఘటన జరిగిన తర్వాత నిందితుల కాల్డేటాను పరిశీలించామని, రవీంద్ర ప్లాన్ చేసినట్టుగా తెలియడంతోనే అరెస్ట్ చేసి జడ్జ్ ముందు ప్రవేశపెట్టామని ఎస్పీ వెల్లడించారు.