YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల 7,8న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలి 

ఈ నెల 7,8న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలి 

ఈ నెల 7,8న ముఖ్యమంత్రి పర్యటన
ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలి 
ఇడుపులపాయ ఎస్టేట్ లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, జేసీ, ఎస్పీలు
కడప 
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశించారు. ఈ నెల 7,8 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ .జగన్ మోహన్ రెడ్డి జిల్లాకు రానున్న నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్, జేసీ సాయికాంత్ వర్మ , జిల్లా ఎస్పీ అన్బు రాజన్ లు పడా ఓఎస్డీతో కలిసి ఇడుపులపాయలో పలు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఇంకనూ అధికారిక దృవీకరణ పర్యటన రావాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా   హెలిపాడ్, త్రిబుల్ ఐటి, వైఎస్ఆర్ ఘాట్, వైఎస్ఆర్ నూతన విగ్రహం ఏర్పాట్లు, నూతనంగా చేపట్టనున్న నిర్మాణ పనులకు సంబంధించి శిలాఫలకాల ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఇడుపులపాయ ఎస్టేట్ లో ముఖ్యమంత్రి బసచేయనున్న దృష్ట్యా.. అక్కడి ఏర్పాట్లను క్షున్నంగా పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్, జేసీ, ఎస్పీలు హెలీప్యాడ్ ను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. హెలిపాడ్ వద్దకు వచ్చే విఐపీ లకు ప్రత్యేక గ్యాలరీ,  ఏర్పాటుపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ ను పరిశీలించారు. ఘాట్ వద్ద ప్రత్యేకమైన పూల అలంకరణ, పూల మాలలు, మొదలయిన అలంకరణను  శోభాయమానంగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యమంత్రి తిరిగే పరిసరాలన్నింటినీ అత్యంత  పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రారంభించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక విగ్రహాన్ని కలెక్టర్ పరిశీలించారు. అలాగే ముఖ్యమంత్రి ప్రారంభించబోయే త్రిబుల్ ఐటీ తరగతి భవనాలను పరిశీలించారు. అందులోని నైపుణ్య శిక్షణ కేంద్రం, ల్యాబులను పరిశీలించారు. నూతన నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాల ఏర్పాటుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కొవిడ్-19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్(SoP) తప్పనిసరిగా పాటించాలన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా అతి తక్కువ సంఖ్యలో ముందస్తుగా అనుమతించిన వారిని తప్ప, ఇంకెవరిని కూడా ముఖ్యమంత్రి పర్యటనలో అనుమతించడం జరగదని ఈ మేరకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇడుపులపాయ ఎస్టేట్, ట్రిపుల్ ఐటిలలో పనిచేసే వారు, ముఖ్యమంత్రి పర్యటన విధుల్లో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 

Related Posts