YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల శ్రీ వారికి ప్రత్యేక పూజలు

తిరుమల శ్రీ వారికి ప్రత్యేక పూజలు

తిరుమల, జూలై 4, 
తిరుమల స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలుగు అకాడమీ చైర్మెన్ లక్ష్మి పార్వతి దర్శించుకున్నారు. విజయ సాయి రెడ్డి శ్రీవారి దర్శనం చేసుకుని శ్రీవారి సేవ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నాను. శ్రీవారిని ప్రార్దించానని తెలిపారు.ఎందరో ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది భక్తులు ఈ వైరస్ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేక పోతున్నారన్నారు విజయసాయిరెడ్డి. అయినప్పటికీ టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చక్కటి ప్రణాళికతో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం అభినందనీయమని కొనియాడారు. త్వరలో కరోనా వైరస్ కు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించాలని శ్రీవారిని కోరినట్లు తెలిపారు.మరోవైపు స్వామివారిని దర్శించుకున్న వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ త్వరలోనే తెలుగు అకాడమీ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తామన్నారు. తాత్కాలికంగా టీటీడీ భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. తెలుగు ప్రాచీన గ్రంథాలు, పుస్తకాలు, సంస్కృతి తాళపత్ర గ్రంథాలను ఈ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో తెస్తామని పేర్కొన్నారు.

Related Posts