YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పీపీఈ కిట్లు

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పీపీఈ కిట్లు

తిరువనంతపురం, జూలై 7, 
ఓ వ్యక్తిని పట్టుకోవడానికి ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్లతో ఛేజింగ్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో ఈ ఘటన చోటు చేసుకుంది.  పీపీఈ కిట్లతో ఛేజింగ్.. ఈ వీడియోలో పీపీఈ కిట్లు ధరించి కనిపిస్తున్న వారు ఆరోగ్య సిబ్బంది. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తిని పట్టుకోవడానికి వారు ఇలా పరుగెత్తాల్సి వచ్చింది. నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఏమైతేనేం.. చివరికి ఆ వ్యక్తిని పట్టుకొని స్ట్రెచర్‌కు కట్టేసి ఆస్పత్రికి తరలించారు. కేరళలోని పాథనమిట్టలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  పాథనమిట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అయితే అతడు ఆ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఇష్టానుసారం ప్రయాణాలు సాగించాడు. అతడికి కరోనా వైరస్ సోకితే.. చాలా మంది ప్రమాదంలో పడతారని స్థానికులు ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు అతడిని పట్టుకొని ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు.  తాము వెతుకుతున్న వ్యక్తి పాథనమిట్టకు 10 కి.మీ. దూరంలోని చెన్నీర్‌కరాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి వెంటనే అతడి కోసం వేట మొదలుపెట్టారు. హెల్త్ సిబ్బందిని చూడగానే.. అతడు పరుగు అందుకున్నాడు. అతడిని ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. స్ట్రెచర్‌కు బలవంతంగా కట్టేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Related Posts