YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఒక నిండు గర్భిణీని కర్రకు కట్టిన బుట్టలో...నేటి భారతావని దుస్థితి

ఒక నిండు గర్భిణీని కర్రకు కట్టిన బుట్టలో...నేటి భారతావని దుస్థితి

రాయ్‌పూర్ జూలై 8 
ఒక నిండు గర్భిణీని కర్రకు కట్టిన బుట్టలో దవాఖానకు తరలించారు. మనసును ద్రవింపజేసే ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరిగింది. కొండగావ్‌లోని మోహన్బిదా గ్రామానికి చెందిన గర్భవతి అయిన మహిళకు నెలలు నిండాయి. మంగళవారం ఆమెకు నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ అక్కడికి వెళ్లలేకపోయింది. ఆ గర్భిణీ పరిస్థితిని గమనించిన ఆరోగ్య కార్యకర్తలు ఒక కర్రకు బుట్టను కట్టి అందులో ఆమెను ఉంచి దవాఖాన వరకు మోసుకొని వెళ్లారు.కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కొండగావ్ జిల్లా వైద్య అధికారి టీఆర్ కన్వర్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఆ గ్రామానికి అంబులెన్స్ వెళ్లలేకపోయిందని చెప్పారు. దీంతో ఆరోగ్య కార్యకర్తలు ఆమెను కర్రకు కట్టిన బుట్టలో మోసుకుని దవాఖానకు చేర్చారని తెలిపారు. అనంతరం ఆమెను జిల్లా దవాఖానకు తరలించామని, అక్కడ సుఖ ప్రవాసం జరిగిందన్నారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన చెప్పారు.

Related Posts