రాయ్పూర్ జూలై 8
ఒక నిండు గర్భిణీని కర్రకు కట్టిన బుట్టలో దవాఖానకు తరలించారు. మనసును ద్రవింపజేసే ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగింది. కొండగావ్లోని మోహన్బిదా గ్రామానికి చెందిన గర్భవతి అయిన మహిళకు నెలలు నిండాయి. మంగళవారం ఆమెకు నొప్పులు రావడంతో అంబులెన్స్కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ అక్కడికి వెళ్లలేకపోయింది. ఆ గర్భిణీ పరిస్థితిని గమనించిన ఆరోగ్య కార్యకర్తలు ఒక కర్రకు బుట్టను కట్టి అందులో ఆమెను ఉంచి దవాఖాన వరకు మోసుకొని వెళ్లారు.కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కొండగావ్ జిల్లా వైద్య అధికారి టీఆర్ కన్వర్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఆ గ్రామానికి అంబులెన్స్ వెళ్లలేకపోయిందని చెప్పారు. దీంతో ఆరోగ్య కార్యకర్తలు ఆమెను కర్రకు కట్టిన బుట్టలో మోసుకుని దవాఖానకు చేర్చారని తెలిపారు. అనంతరం ఆమెను జిల్లా దవాఖానకు తరలించామని, అక్కడ సుఖ ప్రవాసం జరిగిందన్నారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన చెప్పారు.