YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైద్రాబాద్ నుంచే కరోనా వ్యాక్సిన్

హైద్రాబాద్ నుంచే కరోనా వ్యాక్సిన్

హైద్రాబాద్, ఆగస్టు 4
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి తెలంగాణ నుంచే తొలి టీకా (వ్యాక్సిన్) వ‌స్తుంద‌ని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్‌ బ‌యోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వినియోగంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా ఆయ‌న వెల్లడించారు. హైద‌రాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సందర్శించారు. మంత్రి కేటీఆర్‌ వెంట భారత్ బయోటెక్ అధినేత డాక్టర్ కృష్ణ ఎల్లా, ఆయన భార్య సుచిత్ర ఎల్లా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా భార‌త్ బ‌యోటెక్ సంస్థ ఉద్యోగుల‌తో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.అనంతరం భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైర‌క్టర్ శ‌క్తి నాగ‌ప్పన్‌తో క‌లిసి మంత్రి కేటీఆర్ ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ త‌యారీలో భార‌త్‌ బ‌యోటెక్ ముందంజలో ఉండ‌డం గ‌ర్వంగా ఉంద‌ని మంత్రి అన్నారు. క‌రోనాకు వ్యాక్సిన్ తొలుత హైద‌రాబాద్ నుంచే భార‌త్ బ‌యోటెక్ సంస్థ నుంచి రానుందని ఆయ‌న ఆశాభావం వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్‌ల తయారీలో అభివృద్ధి, ఉత్పత్తిలో భార‌త భాగ‌స్వామ్యం కీల‌క‌మైంద‌ని ప్రపంచ‌దేశాలు చెబుతున్నాయ‌‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రపంచ‌వ్యాప్తంగా వ్యాక్సిన్‌కు ఉన్న అవ‌స‌రాల నేపథ్యంలో హైద‌రాబాద్ ప్రాముఖ్యం కూడా పెరిగిన‌ట్లు తెలిపారు. హైద‌రాబాద్ నుంచి మూడో విడత వ్యాక్సిన్ ప్రపంచ దేశాల‌కు అందించ‌డం గ‌ర్వంగా ఉంద‌ని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. సంస్థకు చెందిన సిబ్బంది అంద‌రి నిరంత‌ర కృషి వ‌ల్లే ఇది సాధ్యమవుతోంద‌ని మంత్రి అభినందించారు. ఈ చర్చా కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ కూడా పాల్గొన్నారు.

Related Posts