YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రన్ వేలో లోపంతోనే ప్రమాదం

రన్ వేలో లోపంతోనే ప్రమాదం

తిరువనంతపురం, ఆగస్టు 8, 
కొజికోడ్‌ విమానాశ్రయానికి చేరుకున్న ‘ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌’ విమానం అనూహ్యంగా అదుపుతప్పి, 35 అడుగుల లోయలో పడిపోవడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్‌ సిబ్బంది, పది మంది చిన్నారులు సహా 174 మంది ప్రయాణికులతో దుబాయ్‌ నుంచి వచ్చిన బోయింగ్‌ 737 (ఫ్లైట్‌ ఐఎక్స్‌ 1344) విమానం శుక్రవారం రాత్రి 7.41 గంటలకు కొజికోడ్‌ విమానాశ్రయంలో దిగుతుండగా ప్రమాదానికి గురయ్యింది. దీంతో విమానం రన్‌వే నుంచి పక్కనే ఉణ్న లోయలోకి దూసుకెళ్లి, రెండు ముక్కలైంది.ఈ ప్రమాదంలో పైలట్లు వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. గతంలో దీపక్ వసంత్ సాథే వైమానిక దళం యుద్ధ విమానం పైలట్‌గా విధులు నిర్వర్తించారు. బోయింగ్ 737 విమానాలను నడపడంలో సాథేకు అపార అనుభవం ఉంది. ‘వృత్తిపట్ల ఎంతో అంకితభావం కలిగిన దీపక్ సాథే ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు.. ఎయిర్‌పోర్స్‌ టెస్ట్ పైలట్‌గా ఉన్నారు’అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.పుణెలోని ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో ప్రారంభ శిక్షణ పూర్తి చేసుకున్న సాథే... అనంతరం హైదరాబాద్‌లోని ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో పైలట్‌ శిక్షణ పొందారు. అత్యుత్తమ ప్రదర్శనతో 1981లో కోర్సును పూర్తి చేసి ‘స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ కూడా సాధించారు. అంతేకాదు సాథేకు ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ 310ను నడిపిన అనుభవం ఉంది.. కమర్షియల్ పైలట్ కావాలని నిర్ణయించుకునే ముందు యుద్ధ విమానాలు నడపడంలో నిష్ణాతుడిగానూ గుర్తింపు పొందారు. ప్రమాదంలో చనిపోయిన కెప్టెన్ అఖిలేష్ కుమార్‌కు గతేడాదే వివాహమయ్యింది.టేబుల్‌ లాంటి రన్‌వే.. రన్‌వేకి ఇరువైపులా చిన్నపాటి లోయలా ఉంటుంది.. జాగ్రత్తగా విమానం లాండ్‌ చేయాలి.. ఏమాత్రం తడబడినా విమానం రన్‌వే నుంచి జారిపోతుంది... వీటినే టేబుల్‌టాప్‌ రన్‌వే కలిగిన విమానాశ్రయాలు అంటారు.. తాజాగా విమాన ప్రమాదం జరిగిన కేరళలోని కోలికోడ్‌ విమానాశ్రయం కూడా ఇలాంటిదే.

Related Posts