YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

10 ఏళ్ల క్రితం హెచ్చరికలు... పట్టించుకోని డీజీసీఏ

10 ఏళ్ల క్రితం హెచ్చరికలు... పట్టించుకోని డీజీసీఏ

తిరువనంతపురం, ఆగస్టు 8, 
కోజికోడ్‌లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన రన్ వే అసలు విమానాలను ల్యాండింగ్ చేయడానికే పనికి రాదట. 2011లోనే దీనిపై పుస్తకం ప్రచురించారు.కేరళలో ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 123 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో చాలా మంది స్పృహ కోల్పోయారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో ఇంతకాలం దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులు.. వందే భారత్ మిషన్‌లో భాగంగా స్వదేశానికి తిరిగొస్తుండగా ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. మరి కొద్ది క్షణాల్లో స్వదేశీ గడ్డపై అడుగు పెడతామనగా ప్రమాదం జరిగింది.ఎయిరిండియాకు చెందిన బోయింగ్ B737 విమానం కోజికోడ్ సమీపంలోని విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్‌వే పైనుంచి పక్కకు జారింది. 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. దీంతో విమానం రెండు ముక్కలైంది.
ప్రమాదం జరిగిన ప్రాంతం విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాంతం చాలా సంక్లిష్టంగా ఉంది. రన్‌వేకు ఆనుకొని లోతైన లోయ ఉంది. రన్ వేకు ఇరువైపుల కూడా నిబంధనల ప్రకారం సురక్షిత ప్రాంతం లేదు.కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన రన్ వే నంబర్ 10 అంత సురక్షితం కాదని 2011లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ రన్ వే నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేదని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించారు. విమానం రన్ వే పైనుంచి జారిపోయే ప్రమాదం ఉందని వివరించారు.‘ఆ రన్ వే లోతైన వాలును కలిగి ఉంది. రన్ వే చివరన లోతైన లోయ ప్రాంతం ఉంది. నిబంధనల ప్రకార రన్ వే చివరన 200 మీటర్ల సురక్షిత ప్రాంతం ఉండాలి. కానీ, అక్కడ సేఫ్టీ ఏరియా 90 మీటర్లు మాత్రమే ఉంది. అదేవిదంగా రన్ వేకు ఇరువైపుల 150 మీటర్ల సేఫ్టీ ఏరియా ఉండాల్సి ఉండగా.. అది కేవలం 75 మీటర్లు మాత్రమే ఉంది’అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఏవియేషన్ నిపుణులు మోహన్ రంగనాథన్ ఆధ్యర్యంలోని కమిటీ.. పౌర విమానయాన శాఖ అడ్వైజరీ కమిటీకి నివేదిక సమర్పించింది.రన్ వే ప్రమాదకరం అని స్పష్టమైన నివేదిక ఇచ్చినప్పటికీ విమానయాన శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై విమర్శలు ఎదురవుతున్నాయి. ‘డీజీసీఏకు కూడా ఈ విషయం తెలుసు. అయినా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది’అని మోహన్ రంగనాథన్ అన్నారు

Related Posts