YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొడైకెనాల్ లో ఖమ్మం యువజంట ఆత్మహత్య

కొడైకెనాల్ లో ఖమ్మం యువజంట ఆత్మహత్య

చెన్నై ఆగస్టు 8, 
తెలంగాణకు చెందిన ఓ యువ జంట తమిళనాడు కొడైకెనాల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ(26)ఆయన భార్య భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన ఏపూరి నందిని(26) కొడైకెనాల్లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు.
2018లో హైదరాబాద్లో ప్రేమ వివాహం చేసుకున్న వీరు కొడైకెనాల్లోని అన్నయ్ థెరెస్సా యూనివర్సిటీ సమీపంలోని ఓ ఇంట్లో ఏడాది కాలంగా నివాసముంటున్నారు. గురువారం నుంచి బయటకు రాలేదు. తెలిసిన వ్యక్తి  ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో లోపలికి చూశాడు. దంపతులిద్దరూ నోట్లో నుంచి నురగలు కక్కి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి లోపలికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే వారు చనిపోయి ఉన్నారు. కాగా గోపీకృష్ణ దంపతులు కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నారని విచారణలో తేలింది.

Related Posts