నిజామాబాద్ ఆగస్టు 13,
నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒక్కరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా వుంది. జాతీయ రహదారి 44 పై అర్మూర్ వైపు నుండి హైదరాబాద్ వైపు వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. డివైడర్ ను దాటి మరోవైపునుంచి వస్తున్న కారు ను ఢికొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటన జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ వద్ద జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురు వ్యక్తులు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అరా తీస్తున్నారు.