YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహంతా కు కరోనా

మహంతా కు కరోనా

లక్నో, ఆగస్టు 13
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడి మహంత్‌ నృత్య గోపాల్‌దాస్‌‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్ ఉన్నట్టు తేలింది. శ్వాసతీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న ఆయనను వైద్యులు పరీక్షించగా.. కోవిడ్ సోకినట్టు పరీక్షల్లో వెల్లడయ్యింది. నృత్య గోపాల్‌దాస్‌ అనారోగ్యానికి గురయినట్టు తెలిసిన వెంటనే మథురకు యూపీ ప్రభుత్వం ఓ వైద్య బృందాన్ని పంపింది. ప్రస్తుతం ఆశ్రమంలోనే ఆయనకు చికిత్స కొనసాగుతోంది.కాగా, ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గోపాల్‌దాస్‌కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబుచేశారు. అలాగే ఆయన అనుచరులు, మథుర కలెక్టర్‌‌తో యోగి మాట్లాడారు. అనంతరం మేదాంత హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ నరేశ్ త్రేహాన్‌తో మాట్లాడిన యోగి.. అవసరమైతే గోపాల్‌దాస్‌ను గురుగ్రామ్‌లో ఆస్పత్రికి తరలించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.ఏటా మథురలో జరిగే కృష్ణాష్టమి వేడుకల్లో మహంత్‌ నృత్య గోపాల్‌దాస్‌‌ పాల్గొంటారు. ఈ ఏడాది కూడా జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే అయోధ్యలోని ఇద్దరు పూజారులు కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. రామమందిరం వద్ద భద్రత విధుల్లో పాల్గొన్న 16 మంది పోలీసులకు కూడా వైరస్ సోకింది.

Related Posts