YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకి, అమరావతికి సంబంధం ఏమిటి

చంద్రబాబుకి, అమరావతికి సంబంధం ఏమిటి

అమరావతి అక్టోబరు 25,
అమరావతి జేఏసీ అంటూ టీడీపీ నాయకులు. మరో పక్క పేదవారు దీక్షలు చేసారు. కొంతమంది మీడియా నాయకులు పేదవారిని మేక్ అప్ ఆర్టిస్టులు అంటున్నారు. అక్కడికి వెళ్లి చూద్దాం అక్కడ ఆర్టిస్టులు, మేకప్ ఆర్టిసులు ఎవరో తెలుస్తుందని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. అసలు చంద్రబాబుకి అమరావతికి సంబంధం ఏమిటి. నేను నా సామాజికవర్గం తప్ప ఎవరూ ఉండటానికి వీల్లేదని ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఇళ్ల స్థలాల కోసం వచ్చిన వారిని ఎన్ని మాటలు అన్నారో చూడండి. ప్రజల తపున పోరాడాల్సిన వ్యక్తి అమరావతి ధనిక రైతుల తరపున మాట్లాడుతున్నాడు. నిన్న లోకేష్ వస్తే పేదలకు ఇళ్ళు స్థలాల కోసం వినతిపత్రం ఇద్దమనుకున్నాం. కానీ ఆయన రాలేదు. ఈ రోజు కిష్టాయపాలెంలో తెలుగుదేశం గూండాలు పేదల పై ట్రాక్టర్ ఎక్కించేందుకు ప్రయత్నించారు. అమరావతిలో ఎనిమిదో వింత ఇక్కడే ఉన్నట్లుగా చంద్రబాబు ఫీల్ అవుతున్నాడని అన్నారు. దళితులు, బీసీలు, మైనారిటీలు తిరగబడితే ఎలా ఉంటుందో మీరు నిన్న చూసారు. దళితులను మోసం చేసినందుకు 5 ఏళ్ళు నిండింది. ఆయన నమ్మకానికి 5 సంవత్సరాలు అనడం హాస్యాస్పదం. 33 వేల ఎకరాలు కాదు అన్ని భూములు కలిపితే 53 వేల ఎకరాలు చంద్రబాబు చేతిలో ఉన్నాయని అన్నారు. విచారణ వేయండి అన్నారు...వేస్తే కోర్టులకు వెళుతున్నారు. ఇక ఎంపీ రఘురామకృష్ణ రాజు పగలు విగ్గు..రాత్రి పెగ్గు అని వ్యాఖ్యానించారు.

Related Posts