YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇన్సూరెన్స్ కంపెనీల కొర్రీలు

ఇన్సూరెన్స్ కంపెనీల కొర్రీలు

హైద్రాబాద్, అక్టోబ‌రు 28, 
సిటీలో భారీ వానల కారణంగా వరదలో మునిగిపోయిన వెహికల్స్ షెడ్లకు చేరాయి. బైకులు, ఆటోలు, కార్లు అనే తేడా లేకుండా లోతట్టు ప్రాంతాల్లోని వెహికల్స్ అన్నీ కరాబ్ అయ్యాయి. కొన్నిచోట్ల వెహికల్స్ కొట్టుకుపోయి పనికి రాకుండా పోయాయి. రిపేర్లకు వేలల్లో ఖర్చవుతుండగా ఓనర్లకు ఆర్థిక భారంగా మారింది. ఇన్సూరెన్స్ ఉన్న వెహికల్స్ ఓనర్లు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు టైమ్‌కు పరిహారం చెల్లించకపోవడంతో చేతి నుంచి చెల్లిస్తున్నారు. మరికొన్ని కంపెనీలు రూల్స్ పేరిట కొర్రీలు పెడుతున్నాయి.వెహికల్స్ రిపేర్లకు వేల రూపాయల్లో ఖర్చు అవుతోంది. టూ వీలర్లకు రూ.3 వేల నుంచి రూ.15 వేలు, ఆటోలకు రూ.5 వేల నుంచిరూ.20 వేల వరకు, కార్లకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అవుతోంది. మునిగిన వెహికల్స్లో ఇంజిన్ ప్రాబ్లమ్సే ఎక్కువగా ఉంటున్నాయని మెకానిక్‌లు చెబుతున్నారు. వరదల కారణంగా దాదాపు 2.4లక్షల ఆటోలు, కార్లు, 5 లక్షల బైకులు నీట మునిగాయనే అంచనా ఉంది. ప్రధానంగా ఆటోలు, కార్ల రిపేర్ల ఖర్చు భారంగా మారింది. సిటీలో ఆటో, కారు కలిపి ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్లు 20వేలుగా ఉన్నాయి. 72 బండ్లలో 18 కార్లు ఫ్లడ్ ఎఫెక్టెడేనని నాంపల్లిలోని ఓ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లెక్కన సర్వీసింగ్ సెంట్లరకు వచ్చే వాటితో 30శాతానికి పైగా వెహికల్స్ వరదల్లో మునిగిపోయినవే ఉన్నాయి.వెహికిల్స్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ ఓనర్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టైమ్‌కు పరిహారం చెల్లించకపోవడంతో జేబుల్లోంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. మరికొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు రూల్స్ అంటూ కొర్రీలు పెడుతున్నాయి. సాధారణంగా జనరల్ ఇన్సూరెన్స్ చేయించుకున్న వారు యాడ్ ఆన్ సర్వీస్, రోడ్ సైడ్ అసిస్టెంట్, ఇంజిన్ ప్రొటెక్షన్, జీరో డిప్రియేషన్ వంటి అదనపు సౌకర్యాలు ఉంటాయి. వరదల్లో కొట్టుకుపోయిన వెహికల్స్కు కొన్ని కంపెనీలు పరిహారం ఇస్తుండగా, మరికొన్ని కంపెనీలు ఇవ్వడం లేదు. జనరల్ ఇన్సూరెన్స్ తీసుకున్న వెహికల్స్ ఇంజిన్‌లోకి వరద నీరు చేరితే క్లయం ప్రాబ్లమ్‌గా మారుతోందని ఓనర్లు చెబుతున్నారు. ఇక బండి పూర్తిగా మునిగి ఇంజన్ ప్రొటెక్షన్ కవరేజీ లేకపోతే, ఇంజన్ పై వేసిన చార్జీలన్నీ ఓనర్లు భరించాల్సి వస్తుందని బీమా ఏజెంట్లు పేర్కొంటున్నారు.వరదల్లో కొట్టుకుపోయిన వెహికల్స్ మళ్లీ నడపడానికి కనీసం నెలరోజులైన పడుతుంది. ఇప్పటికీ అన్ని సర్వీసింగ్ సెంటర్లలో ఫుల్‌గా ఉన్నాయి. దీంతో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో రొటీన్ సర్వీసింగ్ పనులు చేయలేకపోతున్నారు. ఇక ఫ్లడ్ ఎఫెక్టెడ్ వెహికల్ రిపేర్ చేయాలంటే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంజిన్ సమస్యలను పక్కాగా అంచనా వేయాలి. లేదంటే బండి పూర్తిగా పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని మెకానిక్‌లు చెబుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వెహికల్స్లో పూర్తిగా పనిచేయని వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మేజర్ రిపేర్లు ఉన్న వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.

Related Posts