మేడ్చల్ నవంబర్ 20,
అల్వాల్ డివిజన్ అభ్యర్థి చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అల్వాల్ సర్కిల్ కుమ్మరిబస్తీ, చాకలిబస్తీ ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బస్తీల అభ్యున్నయతికి నిరంతరం కృషి చేస్తున్న టీఆరెస్ ప్రభుత్వాన్ని గ్రేటర్లో గెలిపించాలని కోరారు. ఇంటింటికి నల్లా నీళ్లు, 24 గంటల కరంటు, వరద బాధితులకు నష్ట పరిహారం ఇచ్చిన టీఆరెస్ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తారనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోందని విజయశాంతి అన్నారు. మొదటి రోజు ప్రచారంలోనే తనకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ కు అనుగుణంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సారధ్యంలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతారావు ఆశీస్సులతో ప్రచారంలో దూసుకపోతున్నట్లు చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి తెలుపారు.