హైదరాబాద్ నవంబర్ 23,
దుబ్బాక నియోజక వర్గంలో పోటీ చేసిన కత్తి కార్తీక సోమవారం నాడు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ దేవాలయం లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతుందని విమర్శించారు. తాను త్వరలోనే బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని కెసిఆర్ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి మంత్రి పదవులు దక్కలేదని విమర్శించారు. దేశాన్ని పాలిస్తున్న బిజెపి దేశ ఆర్థిక వ్యవస్థ నడిపించే ఆర్థికమంత్రిగా తెలుగు మహిళ అయిన నిర్మలా సీతారామన్ కు అవకాశం ఇచ్చిందని అన్నారు. ఎంతో మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో మంచి పాలన అందించడమే లక్ష్యంగా బీజేపీ లోకి వెళుతున్నట్లు పేర్కొంది.