హైదరాబాద్ నవంబర్ 23,
ఎంఐఎం అధినేత , ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని ఒవైసీని మహిళలు నిలదీసారు. సోమవారం నాడు జాంబాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్ కు మద్దతుగా ఓవైసీ ప్రచారం నిర్వహించారు. స్థానికులు గతం లో ఎంఐఎం ని గెలిపిస్తే జాంబాగ్ లో ఎలాంటి అభివృద్ధి లేదని ఆందోళన కు దిగారు. తాము కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా , ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని మహిళలు ఓవైసీని ప్రశ్నించారు. ఐదేళ్లకోసారి వచ్చి ఓట్లు అడిగి...గెలవగానే మొహం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వారికి సమాధానం ఇవ్వకుండానే అయన వెనుదిరిగి వెళ్లిపోయారు.