శ్రీశైలం నవంబర్ 23,
శ్రీశైలంలో కార్తీక రెండవ సోమవారం భక్తులతో కిటకిటలాడింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కార్తీకమాసోత్సవాల నిర్వహించారు. వేకువజాము నుంచే దర్శనాలకు విచ్చేసిన భక్తులకు శ్రీస్వామిఅమ్మవార్ల లఘుదర్శనానికి ( దూరదర్శనానికి) మాత్రమే అవకాశం ఇచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నాలుగు విడతలుగా ఆర్జిత అభిషేకాలు నిర్వహించారు. ఆర్జిత అభిషేకాలలో మొదటి విడతను ఉదయం. గం. 6.30 లకు: రెండవ విడతను ఉదయం గం. 8.30లకు: మూడవ విడతను ఉదయం గం.11.30లకు: నాలగవవిడతను సాయంత్రం గం.6. 30లకు జరిపించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రెండు విడతలుగా ఆర్జిత హోమాలు నిర్వహించారు. రుద్రహోమం, మృత్యుంజయహోమాలలో మొదటి విడత ఉదయం గం. 8.00లకు మరియు రెండవ విడత గం. 9.30లకు జరిపించారు. చండీహోమం మొదటి విడత ఉదయం గం. 7.30లకు రెండవ విడత ఉదయం గం.10.00లకు జరిపించారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో వేడిపాల వితరణ జరిగింది. భక్తులకు పొట్లాల రూపంలో అన్నప్రసాదాల అందజేసారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ రోజు సాయంత్రం “పుష్కరిణి” వద్ద లక్షదీపోత్సవం మరియు పుష్కరిణి హారతి ఇచ్చారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో మాత్రమే పుష్కరిణి హారతికి భక్తులకు అనుమతి ఇచ్చారు. లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి