YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మారిన పార్టీల అజెండా

మారిన పార్టీల అజెండా

మారిన పార్టీల అజెండా
హైదరాబాద్, ఫిబ్రవరి 27, 
తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీల్లో హీట్ పుట్టిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు భిన్నంగా జరిగే ఈ ఎన్నికల్లో ఈ సారి ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. ఇవి పూర్తిగా బ్యాలెట్‌ పద్ధతిలో జరిగే ఎన్నికలు. తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటి లేదా రెండు ఇలా ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేస్తారు. ఒకటి, రెండు అంకెలతోనే అభ్యర్ధుల జాతకాలు మారిపోతాయి. ఇప్పుడీ ప్రాధాన్యత ఓట్ల పైనే ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలు.తెలంగాణలో జరుగుతున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. అందుకే ప్రాధాన్యత ఓట్లను అంచనా వేయలేని పరిస్థితి. పోలైన ఓట్లలో ఎన్ని చెల్లుబాటు అవుతాయో గుర్తిస్తారు. అలా చెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్య ఓట్లు సగానికంటే ఒకటి ఎక్కువ వస్తే విజేతగా ప్రకటిస్తారు. అలా రాకపోతే ద్వితీయ ప్రాధాన్య ఓట్లను కౌంట్‌ చేస్తారు. అక్కడా ఫలితం తేలకపోతే మూడో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. అయినా కొలిక్కి రాకపోతే నాలుగో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇవి తేలిన తర్వాతే విజేతను ప్రకటిస్తారు.దఫా ప్రధాన పార్టీ అభ్యర్థులు.. ఇండిపెండెంట్లు ఉత్సాహంగా నామినేషన్లు వేశారు కానీ ప్రాధాన్య ఓట్లను తలచుకుని టెన్షన్‌ పడుతున్నారట. బ్యాలెట్‌లో ఒకటి, రెండు అంకెలు జాతకాలను మార్చే ప్రమాదం ఉండటంతో ఆందోళనలో ఉన్నారట. ఇండిపెండెంట్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓట్లు వేసేవారు ద్వితీయ ప్రాధాన్యం ఎవరికి ఇస్తారన్నది కీలకం. అందుకే ఎవరికి వారుగా ఎక్కువ మొదటి ప్రాధాన్య ఓట్లు తమకే పడేలా ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే మొదటి ప్రాధాన్య ఓటు వేసి.. మిగతా ప్రాధాన్య ఓట్ల జోలికి వెళ్లొద్దని ఆయా పార్టీలు తమ కార్యకర్తలకు ఇప్పటికే స్పష్టం చేశాయి.ఇండిపెండెంట్‌ అభ్యర్థులతో మాట్లాడుకొని.. ద్వితీయ ప్రాధాన్యం ఓట్లు తమకు పడేలా ఒప్పందం చేసుకోబోతున్నట్టు సమాచారం. ఈసారి రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఐదేసి లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉండటంతో ఎక్కువ మంది ఓటర్లను కలవడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే స్వతంత్రులతో కొంత కథ నడిపించే పనిలో ఉన్నారట. ఈ సందర్భంగా 2015 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను.. అప్పుడు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు.నాడు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు మొదటి ప్రాధాన్య ఓట్లతోనే గెలిచారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచారు. కరీంనగర్‌లో టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి అయితే ఏకంగా ఆరో ప్రాధాన్య ఓట్లను కలిపిన తర్వాతే గట్టెక్కారు. అందుకే ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులకు విజయం నల్లేరుపై నడక కాదన్న టాక్‌ వినిపిస్తోంది.

Related Posts