YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆత్మ గౌరవ ఉద్యమం మొదలయింది ఎన్నారైలతో ఈటల సంభాషణ

ఆత్మ గౌరవ ఉద్యమం మొదలయింది ఎన్నారైలతో ఈటల సంభాషణ

హైదరాబాద్
ప్రవాస తెలంగాణ వాసులతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బేటీ అయ్యారు. జూమ్ యాప్ ద్వారా అయన వారితో మంగళవారం ఉదయం మాట్లాడారు. ఈ సందర్బంగా పలువురు ఎన్నారైలు అయనకు మద్దతుగా నిలిచారు. నీళ్ళు. నిధులు,  నియామకాల ను సాధిం,చుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ లో మరో ఉద్యమం మొదలైంది. అది ఆత్మ గౌరవ ఉద్యమం. తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా? అనే అంశంపై ఈటల కి మద్దతుగా పలువురు ఎన్నారైలు మాట్లాడారు. ఈటల మాట్లాడుతూ పూర్తిగా తప్పుడు ఆరోపణలతో నన్ను బయటికి పంపిచారాని అన్నారు. సిట్టింగ్ జడ్జితో నా మొత్తం వ్యాపారం మీద సంపాదించిన ఆస్తుల మీద విచారణ చేయించండి అని సీఎం ను కోరానని అయన వెల్లడించారు. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడను.  ప్రజల ను నమ్ముకున్నాను.  ప్రలోభాలకు లొంగ లేదు కాబట్టే ఈ నిందలు వేస్తున్నారని  ఈటల అన్నారు. ప్రవాస తెలంగాణ వాసులు తనకు మద్దతు తెలిపినందుకు అయన ధన్యవాదాలు తెలిపారు.

Related Posts