సికింద్రాబాద్
సనత్ నగర్ నియోజకవర్గ పరిధి మోండా డివిజన్ రాంగోపాల్ పేట్ డివిజన్ లో జరుగుతున్న నాలా అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ కొంతం దీపిక, చీర సూచిత్ర, మున్సిపల్ అధికారులు పాల్గోన్నారు. . ఏండ్ల తరబడి ముంపుకు గురైతున్న బండి మెట్, నాలా బజార్, ఆవుల మంద, కళాసి గూడ తదితర ప్రాంతాలకు ఈ పని వల్ల విముక్తి కలుగుతుందని మంత్రి అన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇలాంటి పనులు చేయడానికి అనువుగా ఉంటుందని,సుమారు ఐదు కోట్ల రూపాయల తో ఈ నాలా అభివృద్ధి పనులు చేస్తున్నామని మంత్రి తెలిపారు...