YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రూ. 100 కొడితే 500 డ్రా... ఆందోళన లో ఏటీఎం సిబ్బంది... సంబరాల్లో ఖాతా దారులు...

రూ. 100 కొడితే 500 డ్రా...  ఆందోళన లో ఏటీఎం సిబ్బంది...  సంబరాల్లో ఖాతా దారులు...

రూ. 100 కొడితే 500 డ్రా...  ఆందోళన లో ఏటీఎం సిబ్బంది...   సంబరాల్లో ఖాతా దారులు...   దేవరకద్ర మండల కేంద్రంలోని ఓ ఏటీఎం లో  శనివారం వింత చోటుచేసుకుంది.
వనపర్తి జిల్లా అమరచింత స్థానిక బీజేపీ జెండా కట్ట వద్ద ఉన్న ఇండియా నెంబర్ 1 ఏటీఎం లో రూ.100 కొడితే ఏకంగా రూ.500 డ్రా అయ్యాయి.దీంతో డ్రా చేసిన ఖాతా దారులు అవ్వకయ్యారు.ఈ సీక్రెట్ తెలిసిన ఖాతాదారులు ఏటీఎం ముందు బారులు తీరి మరి,డబ్బులు డ్రా చేసి సంబరాల్లో తేలారు.ఉదయం పోలీసులు పెట్రోలింగ్ కు అటువైపు రావడంతో ఖాతా దారులు పారిపోయారు.అనుమానం వచ్చిన పోలీస్ లు ఓ వ్యక్తని అరా తీయగా రూ.4వేలు డ్రా చేస్తే రూ.20 వేలు వచ్చాయనడంతో అస్సలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులు ఏటీఎం కు తాళం వేయించి, సిబ్బంది సమాచారం అందించారు.ఏటీఎం సాంకేతిక లోపంతో గత మూడు రోజులుగా రూ.5లక్షల 88 వేలు అదనంగా డ్రా అయినట్లు ఏటీఎం లో డబ్బులు లోడ్ చేసే ఉద్యోగి ప్రవీణ్ కుమార్ తెలిపారు.డబ్బులు సెట్ చేసే ఏటీఎం కాష్ బాక్స్ లో రూ.100 కు బదులు రూ.500 నోట్లు సెట్ చేయడం వల్ల పొరపాటు జరిగినట్లు వెల్లడించారు.పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా అవ్వడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి డబ్బులు రికవరీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.డ్రా చేసిన వ్యక్తులు అదనంగా డ్రా అయిన డబ్బులను స్వచ్చందంగా తిరిగి తమకు అప్పగించాలని విజ్ఞప్తిచేశారు

Related Posts