YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

బ‌స్టాప్‌లోతల్లిని వ‌దిలేసి వెళ్లిపోయిన తనయులు

బ‌స్టాప్‌లోతల్లిని  వ‌దిలేసి వెళ్లిపోయిన తనయులు

వికారాబాద్ జూన్ 21
ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌. క‌ని పెంచి పోషించిన త‌ల్లినే రోడ్డున ప‌డేశారు ఓ ముగ్గురు కుమారులు. ఈ ఘ‌ట‌న కొడంగ‌ల్ బ‌స్టాప్‌లో చోటు చేసుకుంది. ఓ 80 ఏండ్ల వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే వృద్ధురాలిని పోషించ‌డం త‌మ‌కు భారంగా మారింద‌ని భావించిన కుమారులు.. ఆమెను కొడంగ‌ల్ బ‌స్టాప్‌లో మూడు రోజుల క్రితం వ‌దిలేసి వెళ్లిపోయారు. రెండు రోజుల పాటు ఆమె ఎలాంటి ఆహారం తీసుకోలేదు. దీంతో వృద్ధురాలు అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన మాన‌వతామూర్తులు.. ఆమెకు ఆహారం అందించారు. ఆ త‌ర్వాత కొడంగ‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డికి స‌మాచారం అందించారు. వృద్ధురాలిని త్వ‌ర‌లోనే సుర‌క్షిత‌మైన ప్రాంతానికి త‌ర‌లిస్తామ‌ని మున్సిప‌ల్ చైర్మ‌న్ పేర్కొన్నారు.

Related Posts