YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏవోబీలో రెండు మందుపాత‌ర‌లు స్వాధీనం

ఏవోబీలో రెండు మందుపాత‌ర‌లు స్వాధీనం

ఏవోబీలో రెండు మందుపాత‌ర‌లు స్వాధీనం భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు త‌ప్పిన పెనుముప్పు
భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టులు ఏర్పాటుచేసిన రెండు మందుపాత‌ర‌ల‌ను గాలింపు బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నారు. 
ఏవోబీలో మ‌ల్క‌న్‌గిరి జిల్లా జొడొంబో పోలీసుస్టేష‌న్ ప‌రిధిలో జాజుపాలెం-కెందుగుడా వ‌ద్ద జ‌రుగుతున్న నిర్మాణం జ‌రుగుతున్న ర‌హ‌దారిలో ఏర్ప‌టుచేసిని రెండు టిఫిన్ ఐఈడీల‌ను బీ ఎస్ ఎఫ్ మ‌రియు ఒడిశా పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. 
ఇటీవ‌ల గాలింపుల‌కు వ‌స్తున్న ఆంధ్రా-ఒడిశా బ‌ల‌గాల‌ను తుద‌ముట్టించ‌డానికి నిర్మాణంలో ఉన్న ర‌హ‌దారిని మావోయిస్టులు ఎంచుకుని రెండు మందుపాత‌ర‌ల‌ను ఏర్పాటు చేశారు. వీటిపై ప‌క్కా స‌మాచారం అందుకున్న ఒడిశా పోలీసులు మ‌రియు బీ ఎస్ ఎఫ్ బ‌ల‌గాలు గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హించి మందుపాత‌ర‌ల‌ను క‌నుకున్నారు. వెంట‌నే బాంబు నిర్వీర్య బృందాల‌ను పిలిపించి మందుపాత‌ర‌లను తొల‌గించారు.  ఒక్కొక్క మందుపాత‌ర 2.5 బ‌రువు ఉంద‌ని పోలీసువ‌ర్గాలు తెలిపాయి. 

Related Posts