అమరావతి, అరాచకంగా వ్యవహరిస్తే ముందు రోజుల్లో మూడింతలు మూల్యం చెల్లిoచకతప్పదు దేశంలో కరోనా కేసులు తగ్గినా ఏపీలో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తగ్గడం లేదు చంద్రబాబు నాయుడు
వైసీపీ పాలనలో రాజ్యాంగం, చట్టం అడుగడుగునా దుర్వినియోగం అవుతున్నాయి. ముఖ్యమంత్రి పాలన గాలికొదిలి ప్రతిపక్ష పార్టీ నేతల్ని, వారి కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. . అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులపై కోటబొమ్మాళి పోలీసులు బైండోవర్ కేసులను నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం. పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్టు వ్యవహరిస్తే ముందు రోజుల్లో ఇబ్బందులు తప్పవు. హరివరప్రసాద్, సురేష్, కృష్ణమూర్తిపై పోలీసులు పెట్టిన అక్రమ రౌడీషీట్ వెంటనే ఎత్తి వేయాలి. దేశంలో కరోనా కేసులు తగ్గినా ఏపీలో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తగ్గడం లేదు. అక్రమ కేసులకు రౌడీ షీట్లకు భయపడే నాయకులు టీడీపీలో లేరు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో 3 ఏల్లే వ్యాలీడిటి. అధికారం ఉంది కదా అని జగన్ రెడ్డి అరాచకంగా వ్యవహరిస్తే ముందు రోజుల్లో మూడింతలు మూల్యం చెల్లిoచకతప్పదని అయన అన్నారు.