YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సిఎం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సిఎం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సిఎం
తిరుపతి అక్టోబర్ 11
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి, తిరుమలలో రెండు రోజుల పర్యటనలో బాగంగా  పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్‌.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జగన్ కు  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఎంపీలు రెడ్డప్ప, డాక్టర్‌ గురుమూర్తి సీఎంకు స్వాగతం పలికారు.

Related Posts