YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ముచ్చింత‌ల్ కుటీర ప్రాంగణంలో మొక్క‌లు నాటిన సీఎం కేసీఆర్

ముచ్చింత‌ల్ కుటీర ప్రాంగణంలో మొక్క‌లు నాటిన సీఎం కేసీఆర్

ముచ్చింత‌ల్ కుటీర ప్రాంగణంలో మొక్క‌లు నాటిన సీఎం కేసీఆర్
హైద‌రాబాద్ అక్టోబర్ 11
: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మానికి సీఎం కేసీఆర్ కుటుంబ స‌మేతంగా సోమ‌వారం మ‌ధ్యాహ్నం సందర్శించారు.ఈ సందర్బంగా ముచ్చింత‌ల్ ఆశ్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వేద‌పండితులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను శాలువాల‌తో చిన‌జీయ‌ర్ స్వామి స‌త్క‌రించి, వారిని ఆశీర్వ‌దించారు. ఈ సంద‌ర్భంగా జీవ ప్రాంగ‌ణంలోని కుటీరంలో చిన‌జీయ‌ర్ స్వామితో స‌మావేశ‌మైన సీఎం కేసీఆర్.. భ‌గ‌వ‌త్ రామానుజ‌చార్య ప్రాజెక్టు వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా కుటీర ప్రాంగణంలో సీఎం కేసీఆర్ మొక్క‌లు నాటారు.. రామానుజ స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 5న స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, కేంద్ర‌మంత్రులు, ఆయా రాష్ట్రాల సీఎంల‌ను చిన‌జీయ‌ర్ స్వామి ఆహ్వానించిన విష‌యం తెలిసిందే.

Related Posts