జీడిమెట్ల
తెల్లవారుజామున ఓ గంట పాటు కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ సూరారం డివిజన్ పరిధిలోని కృష్ణ నగర్ లో ఉదయం ఈదురుగాలులతో కూడిన రాళ్ళ వర్షం పడడంతో 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు ఇళ్ల రేకులు పగిలిపోయాయి. మరికొన్ని ఇళ్ల రేకులు ఎగిసిపడ్డాయి. దాంతో ఇళ్లలోకి నీరు చేరడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు విద్యుత్ స్తంభాలు నెలకూలడంతో పాటు మూడు చెట్లు విరిగిపడ్డాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సూరారం డివిజన్ కార్పొరేటర్ సత్యనారాయణ ఆ ప్రాంతానికి చేరుకుని జిహెచ్ఎంసి, విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో డి ఆర్ ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చెట్లను తొలగించారు. తమకు నష్ట పరిహారం అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు బాధితులు.