హైదరాబాద్ మే 16
మధుగురు అక్షర యజ్ఞం ఆద్వర్యం లో పదో తరగతి చదువు తున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న టెలీ టీచింగ్ ప్రోగాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మధుగురు అక్షర యజ్ఞం నిర్వాహకులు రౌతు మధుకర్ ఒక ప్రకనటలో తెలిపారు. గత రెండు సం వత్సరాలు కరోనా వైరస్ కారణంగా విద్యార్థులు చదువులకు దూరమై అనేక ఇబ్బందులకు పడుతు న్నారని తెలిపారు. దీంతో పదో తరగతి చదువు తున్న విద్యార్థులకు విద్యాపరమైన సందేహాలను అర్హత కలిగిన ఉపాధ్యాయులచే సెల్ఫోన్ ద్వారా ఉచితంగా నివృత్తి చేయడం జరుగుతుందని పేర్కొ న్నారు. పూర్తి వివరాలకు 9441226834, 949150405 నంబర్లకు సంప్రదించాలని కోరారు.