హైదరాబాద్ జూన్ 28
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11గంటలకు విడుదల చేశారు. ఒకే క్లిక్లో ఇంటర్ ఫస్టియర్,సెంకడ్ఇయర్ ఫలితాలనుసాక్షిఎడ్యుకేషన్.కామ్ www.sakshieducation.com)లో చూడొచ్చు.ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు ఫస్టియర్లో 63.32 శాతం, సెకండ్ ఇయర్లో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. కాగా, ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఆగస్టు చివరి నాటికి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్టు మంత్రి సబిత తెలిపారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో, హన్మకొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక, జూలై 11 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. కాగా, టెన్త్ ఫలితాల ఆలస్యంతో ఇంటర్ తరగతులు లేటుగా ప్రారంభమవుతున్నాయని అన్నారు. అయితే, మే 23న ఇంటర్ పరీక్షలు పూర్తి కాగా.. ఫలితాలు కాస్తా ఆలస్యంగా విడుదలయ్యాయి. ఈ ఏడాది 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.