YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు పై పోటీకి హీరో

చంద్రబాబు పై పోటీకి  హీరో

తిరుపతి, జూన్  29,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల వేడిని తలపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆరోపణలు, బూతులు, సవాళ్లతో ఇప్పుడే ఏపీ రాజకీయాలు ఎన్నికలను సమరాన్ని తలపిస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీ జనంలోకి వెళ్లేందుకు ఇప్పటి నుండి ప్రణాళికలు రచిస్తోంది. చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తోంది. దీనికి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. రాబోయే ఎన్ని్కల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ మహానాడు, బహిరంగా సభలు, పాదయాత్ర వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువైతోంది. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే, అధికార వైసీపీ రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించేందుకు భారీ వ్యూహాం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు స్టార్ హీరోను బరిలోకి దింపేందుకు రెఢీ అవుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తమిళ్ స్టార్ హీరో విశాల్‌ను వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుపై పోటీకి దించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, విశాల్ తమిళ్ హీరో అయినప్పటికీ.. అతడి తండ్రి కృష్ణారెడ్డి తెలుగు వ్యక్తే. అంతేకాకుండా వారి బంధువులు కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికి ఉన్నారు. విశాల్‌కు కూడా రాయలసీమలో ఫ్యాన్ ఫోలోయింగ్ భారీగా ఉంటుంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ చూస్తోందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా హీరో విశాల్ ఏపీ సీఎం జగన్‌కు వీరాభిమాని. ఈ విషయాన్ని అతడే ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పాడు. ఈ సమీకరణాలు అన్నింటిని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుపై విశాల్‌ను పోటీకి దింపేందుకు వైసీపీ సిద్ధమైనట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే, కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1989 నుంచి అక్కడ మాజీ సీఎం చంద్రబాబుకు తిరుగేలేదు. కుప్పం నియోజక వర్గంలో ప్రత్యర్థి ఎవరైనా వార్ వన్ సైడే అంటే అతిశయోక్తి కాదు. కుప్పంలో అంతటి బలమైన సామ్రాజ్యం నిర్మించుకున్నాడు బాబు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతడికి కుప్పంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది. గెలుపు ఉత్సాహాంతో ఉన్న వైసీపీ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో చెక్ పెట్టడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే హీరో విశాల్‌ను రంగంలోకి దించాలని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ఊపందుకున్నాయి. ఇటీవల వైసీపీ నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడిస్తామని పదే పదే చెబుతోంది. అయితే, ఈ వార్తలపై విశాల్ నుండి కానీ, అటు వైసీపీ నుండి కానీ అధికారికంగా క్లారిటీ లేదు.

Related Posts