పెద్దపల్లి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సోమవారం పట్టణంలోని నేతాజీ విగ్రహానికి బీజేపీ నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయంతేగాని వర్ధంతి లేని ఏకైక నాయకుడని కొనియాడారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన గొప్ప దేశభక్తుడని కీర్తించారు. తన ఆశయసిద్ధికోసం అజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భరతమాత ముద్దుబిడ్డగా చరిత్రలో నిలిచి పోయిన మహనీయుడన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రమోద్ రావు, తూముల శ్రీనివాస్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మోలుగురి రాజవీరు, మోర మనోహర్, మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ సయ్యద్ ఫయాస్, లింగంపల్లి కరుణాకర్, బాలసాని సతీష్, వునుకొండ తిరుపతి, వునుకొండ భూమయ్య, ఐద తిరుపతి, కల్వల శ్రీనివాస్, వేల్పుల రమేష్, మోసంపల్లి శ్రీధర్, నాయిని శ్రీనివాస్ రెడ్డి, బండి రాజేష్, గాదె రాజేష్, మేకల సతీష్, పెంచాల మల్లయ్య, మన్నన్ తదితరులు పాల్గొన్నారు.