మేడ్చల్
హైదరాబాద్ శివారు ప్రాంతమైన శామీర్ పెట్ పోలీసు స్టేషన్ పరిధిలో మేడ్చల్లో కాల్పు లు కలకలం రేపాయి. వినాయక వైన్స్ దగ్గర దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. మూడు రౌండ్ల పాటు ఫైరింగ్ చేసారు. తుపాకులతో బెదిరించి రూ.2 లక్షలు చోరీ చేసారు. మంకీ క్యాప్ ధరించి ముగ్గురు వ్యక్తులు, వైన్ షాప్ లో పని చేస్తున్న జైపాల్ రెడ్డి, బాలకృష్ణ పై దాడి చేసారు. దుండగులు మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రి దగ్గర ఘటన జరిగింది. నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలు ఏర్పాటు చేసామని పెట్ బషీర్ బాగ్ ఏసిపి రామలింగరాజు వెల్లడించారు.