YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శక్తి స్థూపానికి చిన్న జీయర్ భూమి పూజ

శక్తి స్థూపానికి చిన్న జీయర్ భూమి పూజ

విశాఖపట్నం
ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్శిటీకి చిన్న జీయర్‌ స్వామి విచ్చేశారు.ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి స్వామీజీకి సాదరంగా స్వాగతం పలికారు. ఉదయం 10.30గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కూడా స్వామీజీ పాల్గొన్నారు. అనంతరం 11గంటలకు బీచ్‌ రోడ్డులోని ఏయూ యోగా కేంద్రాన్ని సందర్శించారు.ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో శక్తి స్థూపానికి శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి భూమిపూజ చేశారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఆయనకు విద్యార్థులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. శక్తి స్థూపం నిర్మాణం ద్వారా కలిగే ఉపయోగాల గురించి ఆయన వివరించారు. విద్యార్థులకు క్రమ శిక్షణతో కూడిన విద్య రావాలంటే ఆధ్యాత్మికత కూడా వుండాలన్నారు.

Related Posts