
న్యూఢిల్లీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుపై నమోదయిన కేసులు సిబిఐ కి బదిలీ చేయాలన్న పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడిన భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటీషన్ అని ధర్మాసనం పేర్కొంది. సీఐడీ కేసులు సిబిఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బాలయ్య పిటీషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.