YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆచితూచి దెబ్బ..

ఆచితూచి దెబ్బ..

విజయవాడ, మే 10, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినా చేతికి మట్టి అంటకుండా చేసుకుంటారు. ప్రత్యర్థికి సానుభూతి కంటే తనపై వ్యతిరేకత రాకుండా చూసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరు. జగన్ తరహాలో దూకుడుగా వ్యవహరించరు. అందుకే జగన్ అరెస్ట్ చేయాలని టీడీపీ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నప్పటికీ తాను మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిస్తూ కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో తనను యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైలులో వేసిన జగన్ ను క్షమించి చంద్రబాబు వదిలేస్తారని అనుకోవడం కూడా అవివేకమే అవుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసినా, ఏ కేసు నమోదు చేసినా అది జగన్ కు ప్లస్ గా మారి వచ్చే ఎన్నికల్లో తమకు నష్టం చేకూరుస్తుందని నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే రాష్ట్ర పరిధిలో కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లే కనపడుతుంది. జగన్ కు ప్రధానంగా మద్యం కుంభకోణం మెడకు చుట్టుకునేలా ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసింది. ఈ టీం మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారులను ఇప్పటికే అరెస్ట్ చేసింది. రాజ్ కసిరెడ్డితో పాటు చాణక్య, దిలీప్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే తాజాగా ఈ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంటర్ కావడమే ఇప్పుడు ట్విస్ట్కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ మద్యం కుంభకోణానికి సంబంధించిన వివరాలను అందించాలని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను కోరినట్లు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలు చేతులు మారాయని, మనీలాండరింగ్ కూడా పెద్దయెత్తున జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణకు సిద్ధమయింది. అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్ కు స్పష్టమైన సంకేతాలు అందినట్లే అనుకోవాలి. మనీలాండ్ రింగ్ చట్టకింద ఈకేసును టేకప్ చేసిన ఈడీ కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈడీ ఊరికే వచ్చి విచారణ చేస్తుందని అనుకోవడానికి వీలులేదు. దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారని వైసీపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రాజ్ కసిరెడ్డి తో పాటు వైసీపీ పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డితో పాటు మరికొందరిని ఈడీ నిందితులుగా చేర్చడంతో ఇది జగన్ ను కూడా ఇరికించడానికి ముందస్తు ట్రయల్ అని ఈ కేసు తెలిసిన వారు అంటున్నారు. అయితే జగన్ మానసికంగా సిద్ధమయినప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తో పాటు సీబీఐ కూడా ఈ కేసులో ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే జగన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారించే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు న్యాయనిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడలో సక్సెస్ అయినట్లేనని రాజకీయంగా కూడా కామెంట్స్ వినపడుతున్నాయి.

Related Posts