తిరుమలలోని తితిదే మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు నివాసంలో పెంపుడు శునకం లభ్యం కావడం వివాదాస్పదంగా మారింది. కుక్కను పెంచడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని, అపవిత్రమని పండితులు చెబుతున్నారు. శునకాల పెంపును తితిదే ఆగమ సలహాదారు సుందరవదన భట్టాచార్యులు తప్పుబట్టారు. రమణ దీక్షితులు నివాసంలో కుక్కలపై మీడియాలో కథనాలు రావడంతో ఆయన స్పందించారు. స్వామివారి వాహన సేవల్లో శునకం లేదని, శునకం ఆలయ ప్రవేశం చేస్తే సంప్రోక్షణ చేస్తారని ఆగమ పండితులు తెలిపారు. కుక్క ఆలయ ద్వారం దాటడం శాస్త్ర విరుద్ధమని, ఆదిశేషుడి కొండపై కుక్కలను ఎప్పుడో నిషేధించినట్టు వెల్లడించారు.