పశు ఆరోగ్య సేవ పథకం లో భాగంగా జీవీకే వారితో గతంలో ఒప్పందం చేసుకున్నాం. వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. రోజుకి 5 వేల కాల్స్ అందుకోగలేలా చర్యలు తీసుకుంటున్నాం. సీ ఎం ఆదేశాలతో మరింత పకడ్భంధీగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాల్స్ అందుకోవడానికి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు సమయం పెంచుతున్నాం. జీవీకేతో పాటు డైరెక్టర్ కార్యాలయంలో కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు అయన అన్నారు. ప్రస్తుత సంచార వైద్యశాలలకు అదనంగా మరో 100 ఏర్పాటుకు సీ ఎం ను కోరాం. వచ్చిన కాల్స్ లో ఎమర్జెన్సీ వాటికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని అయన అన్నారు.