స్వేచ్ఛ సర్వేక్షన్ (గ్రామీణ) 2018 లో వరంగల్ జిల్లాకు ప్రధమ స్థానంలో నిలిపేందుకు జిల్లా ప్రజలందరు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ అమ్రాపాలి పిలుపునిచ్చారు. సోమవారం నాడు కలెక్టరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 100 శాతం మరుగుదొడ్లను నిర్మించడం జరిగిందని, బహిరంగ మల, మూత్ర విసర్జనకు వెళ్లకుండా విదిగా వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లను వినియోగించుకొనెల ప్రజలను అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి, ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేరళ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని జిల్లా ప్రజలను ఆమె కోరారు.